దేశంలో 24 గంట‌ల్లో 18,819 క‌రోనా కేసులు..

20
covid19
- Advertisement -

కరోనా వైరస్‌ చాపకింద నీరులా వ్యాపిస్తుంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. రికవరీ రేటు తగ్గుతూ వస్తుంది . గ‌త 24 గంట‌ల్లో 18,819 కేసులు న‌మోదుకాగా దీంతో మొత్తం కేసులు 4,34,52,164కు చేరాయి. క‌రోనా నుండి 4,28,22,493 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ కాగా ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనాతో 5,25,116 మంది మృతిచెందారు.

ప్ర‌స్తుతం దేశంలో 1,04,555 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 0.24 శాతానికి చేరాయి, రికవరీ రేటు 98.55 శాతంగా ఉంది. ఇప్పటిరకు 197.61 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశారు.

- Advertisement -