దేశంలో 24 గంట‌ల్లో 18,313 క‌రోనా కేసులు

46
corona
- Advertisement -

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య స్వ‌ల్పంగా పెరిగాయి. గ‌త 24 గంట‌ల్లో దేశంలో 18,313 క‌రోనా కేసులు న‌మోదుకాగా 57 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 4,39,38,764కు చేరగా 4,32,67,571 మంది బాధితులు కోలుకున్నారు. ప్ర‌స్తుతం దేశంలో 1,45,026 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా ఇప్పటివరకు 5,26,167 మంది కరోనాతో మృతిచెందారు.

రోజువారీ పాజిటివిటీ రేటు 4.31 శాతంగా ఉండ‌గా మొత్తం కేసుల్లో 0.33 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 202.79 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశారు.

- Advertisement -