దేశంలో 24 గంటల్లో 16,167 కరోనా కేసులు..

49
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో దేశంలో 16,167 కరోనా కేసులు నమోదుకాగా 41 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,41,61,899కి చేరగా 4,34,99,659 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 1,35,510 కేసులు యాక్టివ్‌గా ఉండగా ఇప్పటివరకు 5,26,730 మంది కరోనాతో మృతిచెందారు. రోజువారీ పాజిటివిటీ రేటు 6.14 శాతానికి చేరగా రికవరీ రేటు 98.50 శాతంగా ఉంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 206.56 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశారు.

- Advertisement -