దేశంలో 24 గంటల్లో 16,103 కరోనా కేసులు..

32
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 16,103 కరోనా కేసులు నమోదుకాగా 31 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 4,35,02,429కి చేరగా 4,28,65,519 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 1,11,711 యాక్టివ్ కేసులుండగా 5,25,199 మంది మృతిచెందారు. ఇక మొత్తం కేసుల్లో 0.26 శాతం కేసులు యాక్టివ్‌గా ఉండగా రికవరీ రేటు 98.54 శాతం, మరణాలు 1.21 శాతం, రోజువారీ పాజిటివిటీ రేటు 1.21 శాతం ఉంది. ఇప్పటివరకు 197.95 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వైద్యశాఖ వెల్లడించింది.

- Advertisement -