దేశంలో పెరిగిన కరోనా కేసులు..

51
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో దేశంలో 15,754 కరోనా కేసులు నమోదుకాగా 47 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,43,14,618కి చేరగా 4,36,85,535 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 1,01,830 యాక్టివ్ కేసులుండగా ఇప్పటివరకు 5,27,253 మంది కరోనాతో మృతిచెందారు. రోజువారీ పాజిటివిటీ రేటు 3.47 శాతంగా ఉండగా మొత్తం కేసుల్లో 0.23 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 209.27 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వైద్యశాఖ వెల్లడించింది.

- Advertisement -