దేశంలో 24 గంటల్లో 12,899 కరోనా కేసులు..

78
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 12,899 కరోనా కేసులు నమోదుకాగా 15 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 4,32,96,692కు చేరగా 4,26,99,363 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 72,474 యాక్టివ్ కేసులుండగా
ఇప్పటివరకు 5,24,855 మంది మృతిచెందారు.

మొత్తం కేసుల్లో 0.17 శాతం కేసులు యాక్టివ్‌గా ఉండగా రికవరీ రేటు 98.62 శాతం, మరణాల రేటు 1.21 శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటివరకు 1,96,14,88,807 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశారు.

- Advertisement -