కాంట్రవర్సీ కామెంట్స్‌..క్లారిటీ ఇచ్చిన సాయిపల్లవి

64
- Advertisement -

విరాటపర్వం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల సందర్భంగా హీరోయిన్ సాయి పల్లవి చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. కాశ్మీర్ ఫైల్స్ చిత్రంలో కశ్మీరి పండితులకు జరిగిన అన్యాయాన్ని చూసి తాను తట్టుకోలేకపోయానని.. అలాగే ఆవులు తరలిస్తున్నారని కొందరు ముస్లింలపై దాడిని కూడా తాను చూడలేకపోయానని చెప్పగా దీనిపై కొన్నివర్గాల నుండి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

తాను ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ను కొంతవరకే క్లిప్పింగ్ గా చేసి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారని.. తనకు హింస అంటే నచ్చదని.. అది ఎలాంటిదైనా తాను దానిని పూర్తిగా వ్యతిరేకిస్తానని ఆమె చెప్పుకొచ్చింది. తాను ఇచ్చిన ఇంటర్వ్యూను పూర్తిగా చూస్తే, తాను ఆ కామెంట్స్ ఎందుకు చేశానో అర్థమవుతుందని, అంతేగాని ఒక క్లిప్పింగ్ మాత్రమే చూసి తనపై ఇలా ట్రోలింగ్ చేయడం కరెక్ట్ కాదని సాయి పల్లవి చెప్పుకొచ్చింది.

ఇక ఇలాంటి సమయంలో కూడా తన వెంటే ఉన్నవారందరికీ ధన్యవాదాలు తెలిపింది. ఇకపై తానేదైనా విషయాన్ని మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు చూసుకుని మాట్లాడుతానని చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోని రిలీజ్ చేసింది.

- Advertisement -