రైతన్నల మరో మూవ్..నగ్నంగా నామినేషన్లు.!

288
farmers
- Advertisement -

కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలు రూపాల్లో నిరసనలు తెలిపిన రైతన్నలు తాజాగా జరుగుతున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఇందుకు తగ్గట్టుగా పలు రాష్ట్రాల్లో ప్రచారం కూడా చేస్తున్నారు.

ఇక తమిళనాట ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతుండగా బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు అన్నదాతలు. అది బీజేపీ బరిలో ఉన్న చోటే. కాషాయ పార్టీ ఎక్కడైతే బరిలో ఉంటుందో అక్కడ నామినేషన్లు వేస్తామని అది కూడా నగ్నంగా వెళ్లి తమ నిరసన తెలియజేస్తామని బీజేపీని హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి బుద్దిచెబుతామని వార్నింగ్ ఇచ్చారు.

మరోవైపు అన్నాడీఎంకే,డీఎంకే మధ్య ప్రధానంగా పోరు ఉండగా అన్ని రాజకీయ పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి.

- Advertisement -