ఖమ్మం వస్తే…షర్మిలకు షాకిస్తాం!

226
Minister Puvvada
- Advertisement -

ఖమ్మం ప్రజలు అన్ని రాజ్యాలు చూసిన తర్వాతే సీఎం కేసీఆర్ నాయకత్వానికి జై కొట్టారని తెలిపారు మంత్రి పువ్వాడ అజయ్‌. ఖమ్మం ప్రజలు ఎవరి ఉచ్చులో పడరని…ఒకవేళ అలాంటి వారు వస్తే ప్రజలే షాకిస్తారని చెప్పారు.

రాష్ట్ర బడ్జెట్‌లో ఆర్టీసీ సంస్థకు రూ.3 వేల కోట్లు కేటాయించిన సీఎం కేసీఆర్‌కు మంత్రి పువ్వాడ కృతజ్ఞతలు తెలిపారు. బడ్జెట్‌లో ఖమ్మం పట్టణ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా రూ.150 కోట్లు కేటాయించారన్నారు.తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్ అద్బుతంగా ఉందని, అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులు జరిగాయ‌న్నారు.

ఆర్ టి సి సంస్థ తరుపున ఉద్యోగుల తరపున ప్రజల తరపున సియం కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. వ్యవసాయానికి పెద్దపీట వేసి రైతు బంధు మరియు సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కల్పించటం శుభ పరిణామంగా తెలిపారు. ఈ నెల 27న ఖమ్మం కొత్త బస్టాండ్‌‌ను ప్రారంభిస్తామని …ఐటీ హబ్‌ రెండో దశకు శంకుస్థాపన, సత్తుపల్లిలో మున్సిపల్‌ కార్యాలయం ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొంటారని అజ‌య్ తెలిపారు.

- Advertisement -