ప్రాజెక్ట్‌-కే ఫైట్ల కోసం భారీసెట్‌..

83
- Advertisement -

సాహో తర్వాత వచ్చిన రాధేశ్యామ్‌ సినిమాలు వరుసగా సెమీహిట్‌ కోట్టడంతో డీలా పడ్డ ప్రభాస్‌…తాజాగా రెబల్‌ స్టార్ కృష్ణంరాజు మృతితో మరింత డిప్రెషన్‌కు గురయ్యారు. దీంతో ప్రభాస్ ప్రస్తుతం వాటి నుంచి కొలుకోని ఇప్పుడిప్పుడే సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో ‘ప్రాజెక్ట్‌-K’ ఒకటి.

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. ఇప్పటికే రిలీజైన ప్రీ లుక్‌ పోస్టర్‌లు సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్‌ చేశాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుపకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.

ప్రాజెక్ట్‌ కేలో భాగంగా ప్రస్తుతం పోరాట ఘట్టాలు తెరకెక్కిస్తున్నారట. కాగా షెడ్యూల్‌ కోసం దాదాపు 40కోట్లతో నాలుగు సెట్స్లను మేకర్స్‌ రూపొందించినట్టు టాక్. ఈసెట్స్‌లలో భారీ స్థాయిలో పోరాట సన్నివేశాలు చిత్రీకరించినున్నారట. దీనికోసం పలువురు హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్‌లు రంగంలోకి దిగనున్నారట.

సై-ఫై థ్రిల్లర్‌ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై అశ్వినీ దత్‌ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. అమితాబ్‌బచ్చన్‌ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా దీపికా పదుకొనే నటిస్తుంది. దీపికాకు ఇదే తొలి తెలుగు సినిమా కావడం విశేషం. ఈ చిత్రాన్ని 2024 సమ్మర్‌లో రిలీజ్‌ చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది.

ఇవి కూడా చదవండి…

గాడ్‌ఫాదర్‌ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే…

- Advertisement -