డీకే.. బొమ్మాళీ !

544
DK ARUNA
DK ARUNA
- Advertisement -

తెలంగాణ ప్ర‌భుత్వం చేస్తోన్న కొత్త జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా ఉంద‌ని ఆరోపిస్తూ హైద‌రాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద ప‌లువురు కాంగ్రెస్ నేత‌లతో క‌లిసి దీక్షకు డీకే అరుణ‌ దిగడంపై నిజామాబాద్ ఎంపీ క‌విత తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఈరోజు క‌రీంన‌గ‌ర్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ…డీకే అరుణ బొమ్మాళి లాంటిదని వ్యాఖ్యానించారు.

Kavitha

సీఎం మీద నోరు పారేసుకోకుండా గద్వాల కోటలో విశ్రాంతి తీసుకోవాలంటూ కవిత సూచించారు. ఏ ప్రాంతాన్ని జిల్లా చేయాలో ముఖ్యమంత్రికి బాగా తెలుసని హితవు పలికారు. భార‌తీయ‌ జ‌న‌తా పార్టీ నేత, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడిపై కూడా ఆమె విమ‌ర్శ‌లు గుప్పించారు. హిందూ, ముస్లింలకు గొడ‌వ‌ పెట్టాలని ఆయ‌న‌ చూస్తున్నారని క‌విత ఆరోపించారు. సెప్టెంబ‌రు 17న తాము తెలంగాణ విమోచన దినం చేయ‌డం లేద‌ని, విలీన దినం చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. వెంకయ్య హిందూ, ముస్లింలకు తగాదా పెట్టాలని చూస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ విమోచన దినం కాదు.. మేం విలీన దినం చేస్తున్నామని ఎంపీ కవిత చెప్పుకొచ్చారు.

- Advertisement -