పోలీస్‌ కానిస్టేబుళ్ల రాత పరీక్ష ఖరారు

643
- Advertisement -

తెలంగాణలో పోలీస్‌ కానిస్టేబుళ్ల నియామక తుది రాత పరీక్ష తేదీని అధికారులు శనివారం ఖరారు చేశారు.వచ్చేనెల‌ 23న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం ఒంటి గంట వరకు ఈ ప‌రీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డువెల్లడించింది.

కొన్ని రోజుల క్రితం పోలీసుశాఖ‌లోని వివిధ విభాగాల్లో కలిపి మొత్తం 9,613 కానిస్టేబుల్ పోస్టులకు ప్ర‌క‌టన విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫిజిక‌ల్ ఫిట్ నెస్ టెస్ట్ ల్లో పాల్గొన్న అభ్యర్థుల్లో 81 వేల మంది అభ్యర్థులు అర్హత సాధించారు. తుది పరీక్ష ద్వారా అభ్య‌ర్థుల‌ను నియామ‌కాల‌కు ఎంపిక చేయ‌నున్నారు. 

- Advertisement -