‘గం..గం..గణేశా’..యాక్షన్ కామెడీ మూవీ

8
- Advertisement -

ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన “గం..గం..గణేశా” సినిమాతో నిర్మాతగా టాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు నిర్మాత వంశీ కారుమంచి. హైలైఫ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో తన స్నేహితుడు కేదార్ సెలగంశెట్టితో కలిసి ఆయన ఈ సినిమాను నిర్మించారు. యాక్షన్ క్రైమ్ కామెడీ మూవీగా దర్శకుడు ఉదయ్ శెట్టి రూపొందించిన “గం..గం..గణేశా” ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను, నిర్మాతగా తన అనుభవాలను ఇంటర్వ్యూలో తెలిపారు నిర్మాత వంశీ కారుమంచి.

– మాది గుంటూరు. యూఎస్ వెళ్లి జాబ్స్, బిజినెస్ చేశాం. లాక్ డౌన్ టైమ్ లో ఇండియాకు వచ్చాము. లాక్ డౌన్ వల్ల యూఎస్ వెళ్లలేకపోయా. చిన్నప్పటి నుంచి సినిమాలకు వెళ్లడం అలవాటు. బాలకృష్ణ అభిమానిని. అమెరికా వెళ్లాక కూడా అక్కడ మన తెలుగు సినిమాలన్నీ చూసేవాళ్లం. మేము పేపర్స్ విసిరేస్తూ థియేటర్స్ లో సినిమాను ఎంజాయ్ చేయడం అక్కడి వాళ్లకు కొత్తగా అనిపించేది. యూఎస్ లో ఇంకొన్నేళ్లు ఉండి ఇండియాకు వచ్చి సెటిల్ అవ్వాలని అనుకున్నాం. అప్పుడు సినిమాలు ప్రొడ్యూస్ చేయాలనే ప్లాన్ ఉండేది. అయితే లాక్ డౌన్ లో ఇక్కడే ఆగిపోవడం వల్ల ఆనంద్ తో సినిమా బిగిన్ చేశాం. ఆనంద్, విజయ్ నాకు మంచి మిత్రులు.

– దర్శకుడు ఉదయ్ శెట్టి ఈ కథ చెప్పినప్పుడు ఆనంద్ కు బాగుంటుంది అనిపించింది. అయితే ఆనంద్ ఇలాంటి కథ చేస్తాడా లేదా అనే సందేహం ఉండేది. కథ విన్నాక ఆనంద్ కూడా తనకు కొత్తగా ఉంటుందని భావించి మూవీకి ఓకే చెప్పాడు. ఆనంద్ ఈ సినిమాలో ఫంకీ క్యారెక్టర్ లో కనిపిస్తాడు. కొంత ఆకతాయిగా, జులాయిగా ఉండే పాత్ర ఇది. గణేష్ విగ్రహం, డబ్బుతో ముడిపడిన యాక్షన్ కామెడీ సినిమా గం గం గణేశా. వినాయక చవితికే ఈ సినిమాను విడుదల చేయాలని అనుకున్నా..అప్పుడు కొన్ని స్ట్రైక్స్ జరగడం, ఆనంద్ బేబి మూవీ మేకోవర్ లో ఉండిపోవడంతో గం గం గణేశాను పోస్ట్ పోన్ చేశాం. ఈ నెల 25న విడుదల చేయాలని ముందుగా అనుకున్నా..ఆ రోజు దిల్ రాజు గారి లవ్ మీ రిలీజ్ చేశారు. సో 31 డేట్ మా మూవీ రిలీజ్ కు పర్పెక్ట్ అనుకుంటున్నాం అన్నారు.

Also Read:ఆ సమస్య ఉంటే..అల్లం తినొద్దు

- Advertisement -