బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ జూన్ 14వ తేదీన సుశాంత్ తన ఇంట్లో అనుమానాస్పద రీతిలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో డ్రగ్స్ కోణం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచారణ చేపట్టింది. ఈ కేసులో తాజాగా ఎన్సీబీ అధికారులు నటి రియా చక్రవర్తిని అరెస్ట్ చేశారు. సుశాంత్ గాళ్ ఫ్రెండ్ గా గుర్తింపు తెచ్చుకున్న రియాను ఎన్సీబీ అధికారులు గత కొన్నిరోజులుగా విచారిస్తున్నారు.

అరెస్టు చేసిన తర్వాత డ్రగ్స్ రికవరీ కోసం ఆమెను వివిధ ప్రాంతాలకు ఎన్సీబీ తీసుకువెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే నార్కోటిక్స్ పోలీసులు ఈ కేసులో పలువుర్ని అరెస్టు చేశారు. రియా సోదరుడు శౌవిక్తో పాటు సుశాంత్ ఇంటి మేనేజర్ సామ్యూల్ కూడా ఎన్సీబీ ఆధీనంలో ఉన్నారు. డ్రగ్స్ కేసులో గత మూడు రోజుల నుంచి రియాను ఎన్సీబీ విచారించింది. డ్రగ్స్ తీసుకున్నదేమో అన్న కోణంలో ఎన్సీబీ అధికారులు రియాకు డ్రగ్స్ పరీక్షలు చేయించనున్నారు. మెడికల్ పరీక్ష తర్వాత రియాను కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారించనున్నారు.