సీఎం కేసీఆర్‌కు జన్మంతా రుణపడి ఉంటాం..

208
ktr
- Advertisement -

అణగారిన కులాల ఆత్మగౌరవం నిలిపేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి దూరంగా ఉండి, సంచార జీవనం సాగిస్తున్నా గుర్తింపు లేని 17 కులాలను బిసి జాబితాలోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్నందుకు స్వాగతిస్తూ 17 కులాలకు సంభందించిన నాయకులు అలాగే ప్రతినిధులు రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వీ. శ్రీనివాస్ గౌడ్ సారధ్యంలో శాసనసభలోని రాష్ట్ర పురపాలక, పరిశ్రమల మరియు ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావుని వారి కార్యాలయంలో కలసి కృతజ్ఞతాభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా కులసంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. గత 73 ఏండ్ల స్వతంత్ర భారతంలో మేము భూమి మీద ఉన్నా.. ప్రభుత్వ రిజర్వేషన్లు దృష్టిలో లేకుండా ఇన్నెండ్లు ఎన్నో బాధలు పడ్డామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చి వెళ్లిన మమ్మల్ని పట్టించుకోలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ బిసి కమిషన్ ఏర్పాటు చేసి వారి ద్వారా 17 కులాలకు సంబంధించిన ఇచ్చిన నివేదికను ఆధారంగా బిసి కులాల జాబితాలోకి తీసుకొవటం వల్ల మా కులాలకు గుర్తింపు లభించిందని మంత్రి కేటీఆర్‌కు వివరించారు.

ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం వల్ల 17 కులాలకు సంబంధించి సుమారు 9, 839 కుటుంబాలలో పండుగ వాతావరణం నెలకొందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు జన్మంతా రుణపడి ఉంటామన్నారు. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి పూర్తి సహాయ సహకారాలు అందించిన మంత్రి కేటీఆర్‌కి మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 17 కులాల సంఘం అధ్యక్షుడు మోహన్ చౌహన్, 17 కులాల ప్రతినిధులు, సంఘాల నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -