హైదరాబాద్‌లో జొయటిస్ కేపబులిటీ సెంటర్

6
- Advertisement -

ప్రపంచంలో ప్రముఖ జంతు ఆరోగ్య సంస్థగా పేరొందిన జొయటిస్ కంపెనీ హైదరాబాద్​లో తమ కేపబులిటీ సెంటర్‌ను విస్తరించాలని నిర్ణయించింది. 2024 సెప్టెంబర్ నుంచి ఈ కార్యకలాపాలు ప్రారంభించనుంది. దీని వల్ల వందలాది మందికి కొత్త ఉద్యోగాలు లభిస్తాయి.

హైదరాబాద్‌లోని జొయటిస్ ఇండియా కెపాబిలిటీ సెంటర్‌ను విస్తరించనున్నట్లు ప్రకటించింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు తో పాటు అధికారుల బృందంతో కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు.

హైదరాబాద్‌లో తమ జొయటిస్ ఇండియా కెపాబిలిటీ సెంటర్‌ను విస్తరించాలన్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి స్వాగతించారు. హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి లైఫ్ సైన్సెస్ హబ్ గా తీర్చిదిద్దాలనే తమ ఆలోచనలకు ఈ పెట్టుబడులు దోహదపడుతాయని అన్నారు.

ఇండియాలో తమ కంపెనీ విస్తరణకు హైదరాబాద్ అనువైన ప్రాంతమని, తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం కావటం సంతోషంగా ఉందని జొయటిస్‌ కంపెనీ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కీత్ సర్‌బాగ్ అన్నారు. తమ కంపెనీ విస్తరణ జంతు ఆరోగ్యానికి సంబంధించి సరి కొత్త సాంకేతిక ఆవిష్కరణలకు ఉపయోగపడుతుందని అన్నారు.

తెలంగాణలో అందుబాటులో ఉన్న ప్రపంచ స్థాయి ప్రతిభా వనరులను సద్వినియోగం చేసుకుంటామని జొయటిస్ ఇండియా కెపాబిలిటీ సెంటర్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ రాఘవ్ అన్నారు. హైదరాబాద్‌లో కంపెనీ విస్తరణకు ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందని మంత్రి శ్రీధర్​బాబు చెప్పారు.

Also Read:‘మిస్టర్ బచ్చన్’ .. ధమాకా ప్లస్

- Advertisement -