మళ్లీ టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి..!

263
yv
- Advertisement -

ఈ నెల 21తో ప్రస్తుత టీటీడీ పాలకమండలి గడువు ముగియనున్న నేపథ్యంలో రేపు జరగబోయే పాలకమండలి సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అన్నమయ్య భవన్‌లో జరనున్న పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

కరోనా నేపథ్యంలో నేరుగా హాజరుకాలేని సభ్యులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశంలో పాల్గొననున్నారు. శ్రీవారి దర్శనం టికెట్ల కోటా పెంపు, ప్రస్తుతం తిరుపతిలో నిర్మిస్తున్న గరుడవారధిని అలిపిరి వరకు పొడిగింపుపై విషయంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మళ్లీ టీటీడీ చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి కే అవకాశం దక్కనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.

- Advertisement -