లాక్‌డౌన్‌ అయినా శ్రీవారికి కోట్లలో ఆదాయం..!

278
YV Subba Reddy about TTD Income
- Advertisement -

టీటీడీకి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని ఎవరూ అపోహలను నమ్మొద్దని కోరారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. శ్రీవారి దర్శనం రద్దు చేసి రెండు నెలలు అయిందని ఎప్పుడూ దర్శనం ప్రారంభమవుతుందో ఇప్పుడే చెప్పలేమన్నారు.

ఈ రెండు నెలల్లో దర్శనాలు లేకపోయినా శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.98 కోట్లు వచ్చిందని వెల్లడించారు. కేవలం ఆన్‌లైన్ ద్వారా రూ.1.79 కోట్లు వచ్చిందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

భక్తులకు ప్రీతిపాత్రమైన స్వామి వారి ప్రసాదాలను తక్కువ ధర (రూ. 50కు అందించే లడ్డూ రూ.25)కే అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

ఏపీలో భౌతికదూరం పాటిస్తూ ఆలయాలను తెరిచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లుచేసినా అన్ని ఆలయాలను మూసివేయాలని కేంద్రం మరోసారి స్పష్టం చేయడంతో ఏపీలోనూ దీన్ని పాటిస్తున్నారు.

- Advertisement -