జగన్ ప్రమాణస్వీకారానికి వేదిక ఖరారు..

297
jagan
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈనెల 30న ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఇవాళ ఆయన్ను వైసిపి ఎల్పీ నేతగా ఎన్నుకున్నారు ఆపార్టీ ఎమ్మెల్యేలు. ఇక జగన్ ప్రమాణ స్వీకారం చేసేందుకు వేదికను ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు అధికారులు. ఈకార్యక్రమానికి భారీ ఎత్తున ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉండటంతో పెద్ద వేదికను ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. తాజాగా విజయవాడ బందరు రోడ్డులోని ఇందిరాగాంధీ స్టేడియంను ఖరారు చేశారు.

జగన్ ప్రమాణస్వీకారోత్సవ ఏర్పాట్లపై సచివాలయంలో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఈ సమావేశానికి డీజీపీ ఠాకూర్‌, విజయవాడ సీపీ, సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌.. తదితరులు హాజరయ్యారు. ఈస్టేడియంలో దాదాపు 40వేల మంది వరకూ పట్టే అవకాశం ఉంది. ఇక ఈనెల 30న ఉదయం 10.30గంటలకు ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణం చేయనున్నారు. జగన్ ప్రమాణ స్వీకారానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరు కానున్నట్లు తెలుస్తుంది.

- Advertisement -