అమిత్ షా తో భేటీ అయిన జగన్

284
YS Jagan
- Advertisement -

ప్రధానితో భేటీ ముగిసిన అనంతరం బీజేపీ జాతియ అధ్యక్షుడు అమిత్ షా ను కలిశారు ఏపీ కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మోదీతో భేటీ అనంతరం ఏపీ భవన్ కు బయలుదేరిన జగన్, మార్గమధ్యంలో అమిత్ షా ఇంటికి వెళ్లి ఆయన్ను కూడా కలవాలని నిర్ణయించుకున్నారు. జగన్ ఢిల్లీ పర్యటన షెడ్యూల్ లో అమిత్ షాతో భేటీ లేనప్పటికీ, మోదీ సూచన మేరకు జగన్, అమిత్ షా ఇంటికి వెళుతున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -