కేసీఆర్ రియల్ హీరో..వైసీపీ ఎమ్మెల్యే ప్రశంసలు

39
- Advertisement -

సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు గుప్పించారు వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. రెండేళ్లలో రూ.650 కోట్లతో తెలంగాణ సచివాలయాన్ని అద్భుతంగా నిర్మించారని కొనియాడారు. రైతుల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు, సుపరిపాలన కోసం అతి తక్కువ సమయంలో అత్యాధునిక సెక్రటేరియట్‌ కట్టిన కేసీఆర్‌ది రియల్‌ విజన్‌ అని ఆయన రియల్ హీరో అని కొనియాడారు.

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఓ డూప్లికేట్‌ అని ..చంద్రబాబుకు ఐదేండ్ల సమయం ఉన్నా రూ.1200 కోట్లు ఖర్చుపెట్టి సెక్రటేరియట్‌ పేరుతో రేకుల షెడ్లు వేశారని, వానొస్తే నీళ్లు లోపలికి వస్తున్నాయని దుయ్యబట్టారు. రాజధాని, సెక్రటేరియట్‌ పేరుతో రూ.15 వేల కోట్ల ఫండింగ్‌ చేసి తాత్కాలిక భవనాలు కట్టి భూమిలో నీళ్లు పోసినట్టు పైసలు ఖర్చుపెట్టారని మండిపడ్డారు.

Also Read:IPL 2023:డబుల్ ధమాకా..గెలిచేదెవ్వరు!

పక్క రాష్ట్రం సీఎం అయినా కేసీఆర్‌ను తాము కచ్చితంగా పొగుడుతామని స్పష్టంచేశారు. విజనరీ అని చెప్పుకొంటున్న చంద్రబాబు..ఎప్పుడూ ఒరిజనల్‌ లేదు.. ఆయన బతుకంతా టెంపరరీయే అని ఎద్దేవా చేశా రు.

Also Read:Asthama:ప్రపంచ ఆస్తమా దినోత్సవం

- Advertisement -