IPL 2023:డబుల్ ధమాకా..గెలిచేదెవ్వరు!

38
- Advertisement -

నేటి ఐపీఎల్ లో అభిమానులకు డబుల్ ట్రీట్ లభించనుంది. మద్యహ్యం 3:30 నిముషాలకు చెన్నై లక్నో తలపడనుండగా రాత్రి 7:30 నిముషాలకు ముంబై ఇండియన్స్ పంజాబ్ జట్లు తలపడనున్నాయి. రెండు మ్యాచ్ లలో కూడా బలమైన జట్లు తలపడుతుండడంతో ఐపీఎల్ అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. లక్నో చెన్నై మద్య జరిగిన గత మ్యాచ్ లో చెన్నై విజయం సాధించింది. అయితే ప్రస్తుతం రెండు జట్లు కూడా తొమ్మిది మ్యాచ్ లు అది 5 విజయాలతో సమానంగా ఉన్నాయి. దాంతో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా ఉండనుంది. ఇక పంజాబ్ తో జరిగిన గత మ్యాచ్ లో చెన్నై ఓటమి చవిచూసింది. అలాగే లక్నో కూడా గత మ్యాచ్ లో బెంగళూరు చేతిలో ఓటమిపాలైంది..

Also Read:త్వరలో నిమ్స్‌కు సీఎం కేసీఆర్ భూమిపూజ..

దీంతో లక్నో చెన్నై రెండు జట్లు కూడా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. ఇక రాత్రి 7:30 నిముషాలకు జరిగే మ్యాచ్ లో ముంబై, పంజాబ్ ఢీ కొట్టబోతున్నాయి. రాజస్తాన్ పై గెలిచిన ఉత్సాహంతో ముంబై బరిలోకి దిగుతుండగా.. చెన్నైపై గెలిచిన ఉత్సాహంతో పంజాబ్ బరిలో దిగుతోంది. దీంతో రెండు జట్ల మద్య పోరు నువ్వా నేనా అన్నట్లు ఉండే అవకాశం ఉంది. ఇక ఈ రెండు జట్లు తలపడిన గత మ్యాచ్ లో పంజాబ్ పై చేయి సాధించింది. దాంతో అదే జోరు కొనసాగించి ముంబై పై మరోసారి ఆధిక్యత ప్రదర్శించాలని పంజాబ్ చూస్తోంది. మరోవైపు ముంబై ఈసారి ఎలాగైనా గెలిచి పంజాబ్ పై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. మరి ఈ ఆసక్తికరమైన పోరులో ఏ జట్టు పైచేయి సాధిస్తుందో చూడాలి. ఇక నిన్న జరిగిన మ్యాచ్ లో గుజరాత్ పై డిల్లీ క్యాపిటల్స్ అద్బుత విజయాన్ని సొంతం చేసుకుంది. మొదట డిల్లీ నిర్దేశించిన 130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా గుజరాత్ ఛేదించలేక చేతులెత్తేసింది. ఫలితంగా డిల్లీ 5 పరుగుల తేడాతో గెలుపొందింది.

Also Read:Asthama:ప్రపంచ ఆస్తమా దినోత్సవం

- Advertisement -