చంద్రబాబు మరో కుట్ర..వైసిపి, ప్రజాశాంతి అభ్యర్ధులు సేమ్..

246
chandra babu Jagan KA Paul
- Advertisement -

ఏపీలో వైఎస్సార్సీపీని ప్రజాశాంతి పార్టీ టెన్షన్ పెడుతోంది. ఇప్పటికే వైసీపీ ఎన్నికల గుర్తు (ఫ్యాన్) మాదిరే కేఏ పాల్ పార్టీ గుర్తు (హెలికాప్టర్) ఉండడం ఆ పార్టీ నేతలకు ఆందోళన కలిగిస్తోంది. దీనికి తోడు వైసీపీ అభ్యర్థులను పోలిన పేర్లతోనే ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులు రంగంలోకి దిగడం ఏపీలో సంచలనం రేపుతోంది. ఏపీలో 35 అసెంబ్లీ, 4 పార్లమెంట్ సెగ్మెంట్లలో ప్రజాశాంతి అభ్యర్థుల పేర్లు వైసీపీ అభ్యర్థులను పోలి ఉన్నాయి. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన వైసీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేశారు.

ఈ వ్యవహారంపై ఓ న్యూస్ ఛానెల్ లైవ్ డిబేట్‌‌లో కేఏ పాల్ వివరణ ఇచ్చారు. తమ పార్టీ అభ్యర్థుత జాబితాను చూస్తే తనకే అనుమానం కలుగుతోందని విస్మయం వ్యక్తంచేశారు. తమ పార్టీ జాబితాలో కొందరు తప్పుడు అభ్యర్థులు ఉన్నారని..వాళ్లు ఎలా వచ్చారో అర్ధం కావడం లేదన్నారు. ప్రజాశాంతి పార్టీ మనుషులను చంద్రబాబు కొన్నారని..ఆయనే ఈ పనిచేసి ఉంటారని ఆరోపించారు.

వైసీపీ ఓట్లను చీల్చేందుకే ఈ కుట్రచేసి ఉంటారని అభిప్రాయపడ్డారు. పర్చురు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు పోటీ చేయగా..ప్రజాశాంతి పార్టీ నుంచి దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు పేరుతో బరిలోకి దిగారు. ఇద్దరు పేర్లు గుర్తులు కూడా సేమ్ ఉండటంతో ఓటర్లు అయోమయంలో ఉంటారని ఈసికి ఫిర్యాదు చేశారు వైసిపి నేతలు.

- Advertisement -