కాంగ్రెస్‌లోకి షర్మిల..ముహుర్తం ఫిక్స్

29
- Advertisement -

ఎట్టకేలకు వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరికకు ముహుర్తం ఖరారైంది. 4 వతేదీన కాంగ్రెస్ లో చేరనున్నారు వైఎస్ షర్మిల. లోటస్ పాండ్ లో కార్యకర్తలతో సమావేశం అయ్యారు షర్మిల. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీలో వైఎస్‌ఆర్‌టీపీ విలీనపై క్లారిటీ ఇచ్చారు. 4న ఉదయం 11 గంటలకు రాహుల్, ప్రియాంక, మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరతానని తెలిపారు షర్మిల. ఏపీసీసీ అధ్యక్షురాలిగా పదవి చేపడతానని సమావేశంలో చెప్పినట్లు తెలుస్తోంది.

4 వతేదీన ఢిల్లీకి రావాలని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నుంచి షర్మిలకు ఆహ్వానం అందింది. షర్మిల కు పీసీసీ అధ్యక్ష పదవి వైపు రాహుల్ మొగ్గు చూపుతున్నారు. ఏఐసీసీ, సిడబ్ల్యుసి లో ఏదైనా ఒక పదవి ఇచ్చే అవకాశం ఉందంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు.

Also Read:సీఎం రేవంత్ కీలక నిర్ణయం..

- Advertisement -