ఆ పత్రికపై మండిపడ్డ షర్మిల..!

239
ys
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు వైఎస్‌ షర్మిల కొత్తపార్టీ పెట్టబోతున్నారా అనే దానిపై తీవ్ర స్ధాయిలో చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించారు వైఎస షర్మిల. తమ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని దురుద్దేశ పూర్వకంగా రాసిన రాతలను తీవ్రంగా ఖండిస్తున్నానని షర్మిల స్పష్టం చేశారు.

తప్పుడు రాతలు రాసిన పత్రిక, చానల్‌ మీద న్యాయపరమైన చర్యలకు వెనుకాడబోనని ఆమె తేల్చి చెప్పారు. ఏ పత్రిక అయినా, చానల్‌ అయినా, ఒక కుటుంబానికి సంబంధించిన విషయాలను రాయటమే తప్పని షర్మిల స్పష్టం చేశారు. అది నీతిమాలిన చర్య అని మండిపడ్డారు.

- Advertisement -