దేశంలో సెంచరీ దాటిన పెట్రోల్ ధర..ఎక్కడో తెలుసా…?

206
petrol price
- Advertisement -

వరుసగా పెరుగుతున్న పెట్రోల్ ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రోల్ ధర ఎంత అని అడిగితేనే గుండెలు బాధుకునే సమయం వచ్చేసింది. రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలు సెంచరీ మార్క్‌కు చేరువకాగా ఓ చోట ఏకంగా 100 దాటేసింది.

హైదరాబాద్‌లో ఈరోజు పెట్రోల్ ధర 36 పైసలు పెరిగి రూ.89.51కు చేరింది. డీజిల్ ధర 39 పైసలు పెరుగుదలతో రూ.83.19కు ఎగసింది. అమరావతిలో పెట్రోల్ ధర 35 పైసలు పెరుగుదలతో రూ.92.29కు, డీజిల్ ధర 37 పైసలు పెరుగుదలతో రూ.85.47కు చేరింది. రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో ఎక్స్‌ట్రా ప్రీమియం పెట్రోల్ ధర లీటరుకు రూ.100 దాటేసింది. ధరల పెరుగుదలతో సామాన్యులు మాత్రం ఇబ్బంది పడుతున్నారు.

- Advertisement -