మే 26న జగన్ ప్రమాణస్వీకారం..!

309
ys
- Advertisement -

ఎన్నికల ఫలితాలు వెలువడకముందే ఏపీలో పొలిటికల్ హీట్ రోజురోజుకి పెరిగిపోతోంది. టీడీపీ,వైసీపీ ఎవరికి వారే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తుండగా వైసీపీ నేతలు ఒకడుగు ముందుకేసి ఏకంగా ప్రమాణస్వీకారానికి ముహర్తము ఖరారుచేసినట్లు తెలుస్తోంది.

ఇదే విషయాన్ని కన్ఫామ్ చేస్తూ శ్రీరామనాడీ జ్యోతిష్యుడు మురపాక కాళిదాసుశర్మ వైఎస్ జగన్ ప్రమాణస్వీకారానికి మే 26 మంచిరోజని చెప్పారు. పోలింగ్ సరళి చూస్తూ వైసీపీకి అనుకూలంగా ఉందని కాలచక్రగమనం స్థితిగతులు వైసీపీకే అనుకూలంగా ఉన్నాయని చెప్పారు.

వైసీపీ అధికారంలోకి రావాలని కోరుతూ మార్చి 27 నుంచి ఏప్రిల్ 12 వరకు అంటే 17 రోజులపాటు నీలాపతాకసహిత రాజశ్యామల యాగం నిర్వహించినట్లు తెలిపారు. వైఎస్ జగన్ చేతులమీదుగా వరుణ ప్రధానం తీసుకుని యాగాన్ని దిగ్విజయంగా ముగించినట్లు తెలిపారు. పరిపాలించే రాజు మంచి ముహూర్తంలో బాధ్యతలు స్వీకరిస్తే దక్షత పెరగడంతోపాటు రాష్ట్రం సుభిక్షంగా ఉండేందుకు సకల గ్రహాల అనుకూలత ఉంటుందన్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా టీడీపీ నేతలు మాత్రం వైసీపీ అధికారంలోకి రావడం కలేనంటూ కొట్టిపారేస్తున్నారు.

- Advertisement -