‘యూత్’ మూవీ టైటిల్ ఆవిష్కరణ

305
Youth
- Advertisement -

బాపట్ల ఎం పి నందిగం సురేష్ సమర్పణలో పెదరావూరు ఫిల్మ్ సిటీ బ్యానర్ పై దిలీప్ రాజా దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘యూత్’ .కుర్రాళ్ళ గుండె చప్పుడు ఉప శీర్షిక. ఈ చిత్రం యొక్క టైటిల్ అనౌన్స్ మెంట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు చిత్ర యూనిట్.

ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ… ఇది వరకు నేను అలీ గారితో ‘పండుగాడి ఫోటో స్టూడియో’ సినిమాను చేసాను. సెప్టెంబర్ లో విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. ఆ స్పూర్తితో నే ఇప్పుడు యూత్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను. దీనికి కుర్రాళ్ళ గుండె చప్పుడు అనేది ఉప శీర్షిక. నా ముందు సినిమా కూడా నా బలం, నా ధైర్యం నా స్ఫూర్తి,నా శ్రేయోభిలాషి అయిన సుకుమార్ గారు స్టోరీ విని ఒకే అంటేనే ప్రాజెక్ట్ పట్టాలెక్కింది ప్రేక్షకులచే ఆదరించబడింది. అలానే ఇపుడు ఈ యూత్ చిత్రం కూడా అతను విని బాగుంది అంటేనే మొదలు కానుంది. ఇక సినిమా విషయానికి వస్తే.. ఒక 22 ఏళ్ల కుర్రాడు కోర్టును మెర్సీ కిల్లింగ్ ను అడుగుతాడు అందుకు ఆ జడ్జ్ ఎందుకు అని అడిగితే ఆ కుర్రాడు నేటి సమాజం లో కుర్రాళ్ళు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాడో.. ఎలాంటి బాధలను భరిస్తున్నాడో తెలియచెబుతాడు.. అదే ఈ చిత్ర కాన్సెప్ట్.

ప్రతి ఒక్క కుర్రాడు ఈ కాన్సెప్ట్ కు కనెక్ట్ అవుతాడు. తమ లైఫ్ లో ఇలానే జరుగుతోందని భావిస్తాడు. ఈ చిత్రాన్ని బాపట్ల ఎం పి నందిగం సురేష్ గారు ఈ చిత్రాన్ని సమర్పించనున్నారు .అందుకు ఆయనకు నా ధన్యవాదాలు తెలియచేస్తున్నా… ఇక ఈ చిత్రం పెనుమూడి, తెనాలి, నిజాం పట్నం హార్బర్, భీమిలి బీచ్, అరకు లోయ, సూర్య లంక తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకోనున్నాము.. మార్చి నుంచి రెగ్యులర్ షూట్ మొదలు పెట్టి జూన్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఇందులో లీడ్ రోల్ ధన్య బాలకృష్ణ నటించనుంది. అలానే వెన్నెల తో పాటు హిందీ నుండి ఇద్దరు ప్రముఖ నటులు, ఆలోక్ జైన్ విలన్ పాత్రలో, తమిళ్ నుండి మరో ఇద్దరు ప్రముఖ నటులు నటించనున్నారు. మంచి కాన్సెప్ట్ తో వచ్చే ఈ సినిమాను ఆదరించమని, అలానే చిన్న సినిమాలు వెంటిలేటర్ మీద ఉన్నాయి వాటిని బ్రతికించమని తెలుగు రాష్ట్రల వారిని కోరుకుంటున్నాను అన్నారు.

- Advertisement -