ప్ర‌‌భాస్ మూవీకోసం భారీ సెట్

600
prabhas
- Advertisement -

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం జిల్ ఫేం రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 20వ సినిమాను చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలావ‌ర‌కు పూర్తయ్యింది. లాక్ డౌన్ కు ముందు విదేశాల్లో షూటింగ్ పూర్తి చేసుకున్నారు. ఇంకా 30శాతం చిత్రిక‌ర‌ణ మిగిలిఉంది. క‌రోనా నేప‌థ్యంలో రెండు నెల‌లు లాక్ డౌన్ కార‌ణంగా షూటింగ్ వాయిదా ప‌డింది. అయితే ఇటివ‌లే ప్ర‌భుత్వం సినిమా షూటింగ్ ల‌కు అనుమ‌తి ఇవ్వ‌డంతో తిరిగి వ‌ర్క్ ను ప్రారంభించారు చిత్ర‌యూనిట్. అయితే ఈమూవీ కోసం హైద‌రాబాద్ లో భారీ సెట్ ను వేస్తున్నార‌ట‌.

ఓ ఆసుప‌త్రి సెట్ కోసం ఐదు కోట్ల రూపాయలు వరకూ ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. ఈసెట్ నాలుగు ఫోర్ల‌తో క‌డుతున్నార‌ట‌. ఈ సెట్ లో దాదాపు ఓ నెల పాటు షూటింగ్ జరగనున్నట్లు సమాచారం. ఆగస్ట్ నుంచి షూటింగ్ ప్రారంభంకానున్న‌ట్లు తెలుస్తుంది. ఈమూవీలో ప్ర‌భాస్ స‌ర‌స‌న పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈమూవీకి రాధేశ్యాయ్ అనే టైటిల్‌ పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నారు చిత్ర‌యూనిట్.

- Advertisement -