రామోజీ ఫిలింసిటీలో ‘సాహో’..

279
prabhas sahoo
- Advertisement -

బాహుబ‌లి సినిమా త‌ర్వాత యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ చేస్తున్న సినిమా సాహో. ఈమూవీకి ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ ద‌ర్శ‌కుడు సుజీత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌భాస్ స‌ర‌సన బాలీవుడ్ న‌టీ శ్ర‌ద్ధా క‌పూర్ హీరోయిన్ గా న‌టిస్తుంది. బాహుబలి చిత్రం త‌ర్వాత ప్ర‌భాస్ కు ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు రావ‌డంతో సాహోను తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో తెర‌కెకెక్కిస్తున్నారు. భారీ బ‌డ్జెట్ తో యువీ క్రియేష‌న్స్ సంస్ధ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటివ‌లే దుబాయ్ లో షూటింగ్ ముగించుకుని హైద‌రాబాద్ లో సెకండ్ షెడ్యూల్ ను ప్రారంభించారు.

saaho prabhas, shraddha

సినిమాలోని కీల‌క స‌న్నివేశాల‌ను, ఫైట్స్ ను హాలీవుడ్ ఫైట్ మాస్ట‌ర్స్ ద‌ర్శ‌క‌త్వంలో దుబాయ్ లో  తెర‌కెక్కించారు. ప్ర‌స్తుతం రామోజీ ఫిలింసిటీలో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్ర‌క‌రిస్తున్నారు. ప్ర‌త్యేకంగా తీర్చిదిద్దిన మార్కెట్ సెట్ లో జ‌రుగుతున్న చిత్రీక‌ర‌ణ‌లో ప్ర‌భాస్, శ్ర‌ద్ధా క‌పూర్ , మ‌రికొంత‌మంది న‌టులు పాల్గొంటున్నారు. న‌ల‌భై రోజుల పాటు ఈషూటింగ్ జ‌రుగ‌నున్న‌ట్లు తెలుస్తుంది.

త‌క్కువ విజువ‌ల్ ఎఫెక్ట్స్ వాడుతూ..యాక్ష‌న్ సీన్స్ ను స‌హ‌జంగా తెర‌కెక్కిస్తున్న‌ట్లు తెలిపారు చిత్ర‌యూనిట్. నీల్‌ నితిన్‌ ముఖేష్‌, ఎవ్లీన్‌ శర్మ, లాల్‌, అరుణ్‌ విజయ్‌, మందిరాబేడి, జాకీ ష్రాఫ్‌, వెన్నెల కిషోర్‌, మహేష్‌ మంజ్రేకర్ ప‌లువురు న‌టీన‌టులు ఈమూవీలో న‌టిస్తున్నారు.

- Advertisement -