“యాత్ర” ప్రీ రిలీజ్ డేట్ ఖ‌రారు..

215
Yatra
- Advertisement -

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి చేప‌ట్టిన పాద‌యాత్ర ఆధారంగా సినిమా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. యాత్ర అనే టైటిల్ తో ఈమూవీని తెర‌కెక్కిస్తున్నారు. వైఎస్ పాత్ర‌లో మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మమ్ముట్టి న‌టిస్తున్నారు. త‌మిళ ద‌ర్శ‌కుడు మ‌హి.వి.రాఘ‌వ‌న్ ఈచిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే విడుదలైన ఈచిత్ర పోస్ట‌ర్, టీజ‌ర్ ల‌కు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంది. దింతో ఈసినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

yatra-mammootty

ఈచిత్రం ఫిబ్ర‌వ‌రి 8న తేదిన థియేట‌ర్ల‌లోకి రానుంది. తాజ‌గా ఈమూవీ ఫ్రీ రిలీజ్ డేట్ ను ఖ‌రారు చేశారు. ఫిబ్ర‌వ‌రి ఒకటో తేదిన హైద‌రాబాద్ లోని ఎన్ క‌న్వేన్ష‌న్ సెంటర్లో ఈవేడుక‌ను నిర్వ‌హించ‌నున్నారు. దానికి సంబంధించిన పోస్ట‌ర్ ను కూడా విడుద‌ల చేశారు చిత్ర‌యూనిట్. ఈకార్య‌క్రమానికి వైసిపి అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజ‌రుకానున్నార‌ని స‌మాచారం.

yatra-mammootty

వైఎస్ తండ్రి రాజారెడ్డి పాత్ర‌లో ప్ర‌ముఖ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు న‌టించ‌గా, అన‌సూయ, సుహాసిని, ప‌లువ‌రు న‌టీన‌టులు కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. శివ మేక సమర్పణలో విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి ఈమూవీని నిర్మిస్తున్నారు. తెలుగు, త‌మిళ్ , మ‌ల‌యాళ భాష‌ల్లో ఈమూవీ విడుద‌ల కానుంది.

- Advertisement -