20రోజుల్లోనే యాదాద్రికి భారీ ఆదాయం..

153
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారికి గడిచిన 20రోజుల్లో రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం సమకూరినట్టు ఆలయ ఈవో ప్రకటించారు. గత 20రోజుల్లో రూ. 2,12,16,700 హుండీ ఆదాయం వచ్చినట్టు తెలిపారు. 167గ్రాముల బంగారం, 2.60కిలోల వెండి  వచ్చినట్టు ఆలయ అధికారులు పేర్కొన్నారు.

ఇక విదేశి కరెన్సీలలో అమెరికా డాలర్లు 1194, యూఏఈ దిర్హామ్స్‌ 140, సౌదీ రియాల్స్‌ 57, ఒమాన్ బైసా 10,500, ఆస్ట్రేలియా 150డాలర్లు, న్యూజిలాండ్ డాలర్స్‌45, ఇంగ్లండ్‌ ఫౌండ్స్‌ 30, కెనడా డాలర్స్‌ 45, సింగపూర్ 74డాలర్స్‌, మలేషియా రింగెట్స్‌ 69 వచ్చినట్టు ప్రకటించారు. అయితే గత 20రోజుల్లో భక్తులు పెద్ద ఎత్తున్న రావడం వల్ల ఇంత ఆదాయం సమకూరినట్టు తెలిపారు.

ఇవి కూడా చదవండి…

తిరుమల అప్‌డేట్..

బంగారం కొనుగోలుదారులకు షాక్..

ముత్యమంతా పసుపు… శరీరమంతా ఛాయ

- Advertisement -