యాదాద్రి…మహాకుంభ సంప్రోక్షణ

27
harish
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహా స్వామి ఆలయ పునరుద్ధరణ పనులు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోనున్నాయి. అడుగడుగునా ఆధ్యాత్మిక వాతావరణం, కండ్లు చెదిరే కట్టడాలతో అద్భుత దివ్యక్షేత్రంగా యాదాద్రి రూపుదిద్దుకుంది. ఇక ఇవాళ కీలకఘట్టమైన మహాకుంభ సంప్రోక్షణ జరగనుంది.

ఉదయం 11.55 గంటలకు యాదాద్రి ప్రధాన ఆలయాన్ని సీఎం కేసీఆర్ పునఃప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత భక్తులకు స్వయంభువుల దర్శనం కల్పించనున్నారు.యాదాద్రిలో కూడా తిరుమలలో మాదిరిగా బ్రేక్‌ దర్శనాలు, ఆన్‌లైన్‌ దర్శనాలు అమలు చేయనున్నారు.

టీటీడీ తరహాలోనే యాదాద్రికి ప్రత్యేక పాలకమండలిని ఏర్పాటుచేసేందుకు సిద్ధమవుతోంది తెలంగాణ ప్రభుత్వం. ఆలయ కార్యనిర్వహణ అధికారిగా ఐఏఎస్‌ అధికారిని నియమించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. యాదాద్రి కొండపైకి భక్తుల వాహనాలను అనుమతించరు. కొండ కింద యాగశాల ప్రాంగణంలోని పార్కింగ్‌ స్థలంలో వాహనాలు నిలిపి, దేవాలయం తరఫున నడిపే బస్సుల్లో కొండపైకి వచ్చి దర్శనం చేసుకోవాలి. ప్రతి భక్తుడికీ క్యూఆర్‌ కోడ్‌ ఇవ్వనున్నారు.

- Advertisement -