కాలినడకన తిరుమలకు వెళ్ళిన టీటీడీ చైర్మన్..

220
- Advertisement -

టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కుటుంబ సభ్యులు శ్రీవారిమెట్టు మార్గంలో కాలినడకన తిరుమలకు వెళ్ళారు. ఈ సందర్భంగా శ్రీవారిమెట్టు వద్ద వైవీ సుబ్బారెడ్డికి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీటీడీ ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి, జేఈవో సదా భార్గవి, టీటీడీ సీవీ అండ్ ఎస్వో గోపీనాథ్ జెట్టి స్వాగతం పలికారు. టీటీడీ చైర్మన్‌గా మరోసారి ఎన్నికైన క్రమంలో రేపు తిరుమల శ్రీవారి ఆలయంలో 9.45 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.

టీటీడీ చైర్మన్‌గా మరోసారి అవకాశం కల్పించినందుకు సుబ్బారెడ్డి సీఎం జగన్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈరెండేళ్ళల్లో ఏదైనా తప్పులు జరిగినా మన్నించాలని శ్రీవారిని వేడుకుంటూ కాలినడక తిరుమలకు వెళ్లారు. కరోనా నుండి ప్రజలను కాపాడాలని పూజలు చేయనున్నట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

- Advertisement -