WTC Final…తొలిరోజు వర్షార్పణం

248
wtc
- Advertisement -

సౌతాంప్టన్ వేదికగా జరుగుతున్న ప్రపంచ టెస్ట్​ ఛాంపియన్​షిప్​ ఫైనల్​కు వరణుడు అడ్డంకిగా మారాడు. ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధం కాగా భారీ వర్షం కారణంగా కనీసం టాస్ పడకుండానే తొలిరోజు ఆటముగిసింది.

టీ విరామం అనంతరం మ్యాచ్ రిఫరీ తొలి రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాడు. మధ్యాహ్నం సమయంలో వర్షం కాస్త తగ్గినట్లు కనిపించినా, ఆ తర్వాత మళ్లీ జల్లులు రావడంతో ఆట జరిగే అవకాశం లేకుండా పోయింది.

శనివారం మధ్యాహ్నం 2:30(భారత కాలమానం ప్రకారం) గంటలకే రెండోరోజు ఆట ప్రారంభించనున్నారు. రేపటి ఆటలో 98 ఓవర్లు బౌలింగ్‌ చేయాల్సి ఉండటంతో అర్ధగంట ముందుగా మ్యాచ్‌ ఆరంభంకానుంది.

- Advertisement -