- Advertisement -
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ షెడ్యూల్ వచ్చేసింది. తొలి సీజన్ 23 రోజుల పాటు మొత్తం 20 లీగ్ మ్యాచులు,2 ప్లే ఆఫ్ మ్యాచులు జరగనున్నాయి. మార్చి 4న తొలి మ్యాచ్ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరగనుంది.
డబ్ల్యూపీఎల్ లో ఐదు జట్లు ఆడనున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్ జట్లు తలపడతాయి.
డీవై పాటిల్ స్టేడియం, బ్రబౌర్న్ స్టేడియంలో మొత్తం 11 మ్యాచుల చొప్పున జరగనున్నాయి. మార్చి 24న డీవై పాటిల్ స్టేడియంలో ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ మార్చి 26న జరగనుంది. వేలం పాటలో మొత్తం 87 మంది క్రికెటర్లను ఆయా ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి.
ఇవి కూడా చదవండి..
- Advertisement -