కరోనా…అప్ డేట్స్

306
corona
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 19.23 లక్షలకు చేరింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 1.19 లక్షల మంది మృతి చెందారు. కరోనా నుంచి 4.43 లక్షల మంది కోలుకున్నారు. అమెరికాలో 5,86,377 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు అమెరికాలో కరోనాతో 23,610 మంది మృతి చెందారు.

దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 10 వేలు దాటింది. దేశంలో కరోనాతో ఇప్పటివరకు 358 మంది మృతి చెందారు.కరోనా నుంచి 1,193 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.

లాక్‌డౌన్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. నేటితో 21 రోజుల దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ముగియనున్న విషయం తెలిసిందే.

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 592కు చేరింది. కరోనాతో ఇప్పటివరకు 17 మంది మృతి చెందారు. మొత్తం 472 యాక్టివ్ కేసులు, 103 మంది డిశ్చార్జ్ అయ్యారు.

సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని 74 లక్షల పేద కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో రూ. 1,500 జమ కానున్నాయి.

ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 439కి చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారినపడి కోలుకున్న 12 మంది డిశ్చార్జ్‌ కాగా, ఏడుగురు మరణించారు. కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 420గా ఉన్నాయి.

- Advertisement -