ప్రపంచం… హైదరాబాద్ వైపు చూస్తోంది

222
World looks at Hyderabad:Modi
- Advertisement -

ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూస్తోందన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. బేగంపేటలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో మోడీ మాట్లాడారు. తొలుత తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన  మోడీ.. బీజేపీ కార్యకర్తలకు అభివందనం చేశారు. హైదరాబాద్ రావడం ఆనందంగా ఉందని…అద్భుతమైన నగరమని కొనియాడారు. హైదరాబాద్ వస్తే సర్దాప్ పటేల్ గుర్తుకొస్తారని చెప్పారు.

Modi lands at Begumpet

ప్రపంచదేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు ఇక్కడికి వచ్చారని తెలిపారు. తెలంగాణను మరింత అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందన్నారు.బీజేపీకి కార్యకర్తలే బలమని చెప్పుకొచ్చారు.కార్యకర్తల శ్రమ ఫలింతగానే బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందన్నారు. దక్షిణాదిన అధికారం చేపట్టే అవకాశం రాకపోయిన ప్రజాసేవకే అంకితమయ్యామని గుర్తుచేశారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరులకు మోడీ జోహర్లు అర్పించారు.

మోడీ..మోడీ నినాదాలతో ఎయిర్ పోర్టు ప్రాంగణం మార్మోగిపోయింది. అంతకముందు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న మోడీకి గవర్నర్ నరసింహన్,సీఎం కేసీఆర్, మంత్రులు ఘనస్వాగతం పలికారు.

- Advertisement -