ఉమెన్స్ డే..గ్రీన్ పోస్టర్‌ను ఆవిష్కరించిన శ్వేతా

56
- Advertisement -

అంతర్జాతీయ మహిళ దినోత్సవం పురస్కరించుకొని ఉమెన్స్ డే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పోస్టర్‌ను ఆవిష్కరించిన కమిషనర్ ఆఫ్‌ హెల్త్‌ మరియు ఫ్యామిలీ వెల్ఫేర్ శ్వేతా మహంతి. బీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్ స్థాపించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను ఉమెన్స్ డే సందర్భంగా ప్రతి మొక్కలు నాటాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ…పిల్లల్ని పెంచిన చేతులు మొక్కల్ని పెంచితే ప్రకృతి పరవశించిపోతుందన్నారు. తమ పిల్లల్ని పెంచడంలో స్త్రీమూర్తులు చూపించే ప్రేమ జాగ్రత్త అద్భుతమని…ప్రేమతో మహిళ లోకం అంతర్జాతీయ మహిళ దినోత్సవం పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్బంగా కమిషనర్ శ్వేతా మహంతి మాట్లాడుతూ…సృష్టికి మూలం స్త్రీమూర్తి అని…మహిళలంతా ప్రకృతి పరిరక్షణ కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవం రోజున అందరూ తోటి అధికారులు అంతా విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి…

ఉమెన్స్ డే..గ్రీన్ ఇండియా పోస్టర్ ఆవిష్కరణ

బాబోయ్‌ ఎండలు..జాగ్రత్తలు తప్పనిసరి!

టీవర్క్స్ ప్రారంభించిన లియూ, కేటీఆర్‌

- Advertisement -