శ్రీలంకపై భారత్ ఘన విజయం

167
ind
- Advertisement -

ఆసియా కప్‌లో భారత్ శుభారంభం చేసింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. భారత్ విధించిన 151 పరుగుల లక్ష్యచేదనలో బరిలోకి దిగిన శ్రీలంక 18.2 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌటైంది. శ్రీలంక జట్టులో హర్షిత సమరవిక్రమ (26), హాసిని పెరేరా (30) మాత్రమే రాణించారు. భారత బౌలర్లలో హేమలత 3 వికెట్లతో చెలరేగగా.. పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ చెరో 2 వికెట్లు తీసుకున్నారు.

ఇక అంతకముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కొల్పోయి 150 పరుగులు చేసింది. షెఫాలీవర్మ (10), స్మృతి మంధాన (6) విఫలమైన జెమీమా రోడ్రిగెజ్ (76) అదిరిపోయే ఆట తీరుతో చెలరేగింది. ఆమెకు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (33) అండగా నిలిచింది. దీంతో భారత్ భారీ స్కోరు సాధించింది. జెమీమా రోడ్రిగెజ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నారు.

- Advertisement -