బొటానికల్ గార్డెన్‌లో రన్‌ ఫర్ పీస్

136
- Advertisement -

బొటానికల్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 10K, 5K, 3K రన్ ఫర్ పీస్ ను జెండా ఊపి ప్రారంభించారు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ..జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బొటానికల్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రన్ ఫర్ పీస్ నిర్వహించడం చాలా శుభ పరిణామం అని దీనికి ఇంత పెద్ద ఎత్తున హాజరైన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

ప్రతిరోజు ఎంతో బిజీ షెడ్యూల్ లో ఉండే మనం వ్యాయామం చేయడం మర్చిపోతున్నామని కానీ బొటానికల్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంత అద్భుతమైన కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని అన్నారు. ఈ గార్డెన్ అభివృద్ధి కోసం అసోసియేషన్ వారు చాలా కృషి చేస్తున్నారని వారికి తమ మద్దతు ఎప్పుడు ఉంటుందని తెలియజేశారు. ఈ గార్డెన్ లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల కోసం తన రాజ్యసభ నిధులనుండి 10 లక్షల రూపాయలను కేటాయిస్తున్నానని తెలియజేశారు.

సంతోష్ గారి ప్రకటనను స్ఫూర్తిగా తీసుకొని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు అరికెపూడి గాంధీ గారు, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి గారు కూడా వారి అభివృద్ధి నిధుల నుండి తలా 10 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా అందరు కలిసి పార్కు అభివృద్ధి కోసం 40 లక్షల నిధులు ఇచ్చిన వారందరికీ వాకర్స్ అసోసియేషన్ వారు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఒంటే ప్రతాపరెడ్డి, స్పోర్ట్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి PCCF డోబ్రియాలు, వాకర్ అసోసియేషన్ ప్రతినిధులు భరత్ రెడ్డి, బాలకృష్ణ ఏవీ రెడ్డి మరియు పెద్ద ఎత్తున వాకర్సు పాల్గొన్నారు.

- Advertisement -