నిరూపిస్తే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటా- మంత్రి కొడాలి

80
- Advertisement -

గుడివాడలో మంత్రి కొడాలి నానికి చెందిన కల్యాణ మండపంలో కేసినో ఆటను నిర్వహించారంటూ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. ఈ విషయాన్ని టీడీపీ ప్రధానాస్త్రంగా మలుచుకుంటోంది. ఆ పార్టీకి చెందిన నేతలు నిజనిర్ధారణ కోసం గుడివాడకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఈ ఆరోపణలపై కొడాలి నాని తీవ్రంగా ప్రతిస్పందించారు.

తన కల్యాణమంటపం రెండున్నర ఎకరాల్లో ఉంటుందని… అక్కడ కేసినోలు, పేకాట వంటివి నిర్వహించినట్టు నిరూపిస్తే పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుంటానని కొడాలి నాని సవాల్ విసిరారు. చంద్రబాబు టైమ్ అయిపోయిందని అన్నారు. ఈరోజు నిజనిర్ధారణకు వచ్చినవాళ్లంతా ఎన్నికల్లో ఓడిపోయిన వారేనని చెప్పారు. వర్ల రామయ్య ఒక పకోడీ.. అతన్ని నిజ నిర్దారణకు పంపుతారా అని ఎద్దేవ చేశారు.

రాష్ట్రంలో అన్ని చోట్ల జూదం జరిగిన విధంగానే గుడివాడలో కూడా జరిగిందని అన్నారు. మహిళలతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారని తనకు సమాచారం అందిన వెంటనే డీఎస్పీకి ఫోన్ చేసి అడ్డుకున్నానని చెప్పారు. చంద్రబాబుకు, నారా లోకేశ్‌కు కేసినోలు బాగా తెలుసని అన్నారు. అమ్మాయిల బొడ్లో వేలు పెట్టిన లోకేష్‌కు కాసినో అంటే బాగా తెలుసు అని హేళన చేశారు.

తన కల్యాణ మండపంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయో, లేదో చెప్పడానికి గుడివాడ ప్రజలు ఉన్నారని టీడీపీ నిజనిర్ధారణ కమిటీ అవసరం లేదని నాని అన్నారు. మహిళలను అడ్డం పెట్టుకుని టీడీపీ రాజకీయాలు చేస్తోందని.. అమ్మాయిలును అడ్డుపెట్టుకున్న చరిత్ర టీడీపీదని.. రాజకీయాల కోసం పెళ్ళాన్ని రోడ్డు ఎక్కించిన వ్యక్తి చంద్రబాబు మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -