కేజీఎఫ్‌ హీరో ఇంత నెమ్మది ఎందుకు

72
- Advertisement -

ప్యాన్ ఇండియా ఇమేజ్ ని హ్యాండిల్ చేయడం స్టార్ యూత్ హీరోలకు పెద్ద సవాల్ గా మారుతోంది. ముఖ్యంగా తర్వాత చేయబోయే సినిమాల మీద అంచనాలు పెరిగిపోవడంతో ఆచితూచి అడుగులు వేస్తూ విలువైన కాలాన్ని ఖర్చు పెట్టేస్తున్నారు. కెజిఎఫ్ బ్లాక్ బస్టర్ తర్వాత యష్ తన కొత్త చిత్రం అనౌన్స్ మెంట్ విషయంలో విపరీతమైన జాప్యం చేయడం అభిమానులను అసహనానికి గురి చేస్తోంది. వచ్చే నెల కెజిఎఫ్ 2 మొదటి యానివర్సరి పూర్తవుతుంది. ఇప్పటిదాకా రాఖీ భాయ్ చేసిందేమి లేదు. ఫ్యామిలీతో గడపటం, ఫారిన్ ట్రిప్పులు కొట్టడం ఇదే ప్రహసనం.

తాజాగా సలార్ లో చిన్న క్యామియో చేశాడన్న వార్త ప్రభాస్ ఫ్యాన్స్ కి ఎగ్ జైట్మెంట్ ఇస్తుంటే అదే న్యూస్ యష్ ఫాలోయర్స్ కి అసంతృప్తి కలిగిస్తోంది. నిజానికి దర్శకుడు నర్తన్ తనకో కథ రాసుకుని ఒప్పించేందుకు విశ్వప్రయత్నం చేశాడు. కానీ కుదరలేదు. రామ్ చరణ్, విజయ్ దేవరకొండలకు స్టోరీ నచ్చింది కానీ వాళ్ళ డేట్స్ అందుబాటులో లేకపోవడంతో ఫైనల్ గా శివరాజ్ కుమార్ తో మఫ్టీ ప్రీక్వెల్ కు వెళ్ళిపోయాడు. ఒకవేళ యష్ కనక ఎస్ చెప్పి ఉంటే ఈపాటికి ఓ పాతిక శాతం షూటింగ్ పూర్తయ్యి ఉండేది. ఇంతకీ తన మనసులో ఎవరున్నారో అంతు చిక్కడం లేదు.

ఇక్కడ యష్ మన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లను చూసి ప్రాక్టికల్ గా ఆలోచించాల్సి ఉంది. చరణ్ ఫామ్ లో లేని శంకర్ తో చేతులు కలిపాడు. తారక్ డిజాస్టర్ మూటగట్టుకున్న కొరటాల శివ స్క్రిప్ట్ ని నమ్మాడు. కెజిఎఫ్ కన్నా వందల రెట్లు గొప్ప విజయం సాధించిన ఆర్ఆర్ఆర్ కథానాయకులు ప్లాన్ చేసుకున్న తీరు రిస్క్ అనిపించినా ఆ దర్శకుల మీద నమ్మకంతో ముందడుగు వేస్తున్నారు. అంతే తప్ప అతి జాగ్రత్త పడలేదు. యష్ మాత్రం ఇంకా మీనమేషాలు లెక్కబెడుతూ ప్రశాంత్ నీల్ రేంజ్ డైరెక్టర్ దొరికే వరకు వేచి చూస్తాడేమో. ఇలా అతి ఆలస్యం కూడా కొంపముంచేదే.

ఇవి కూడా చదవండి..

- Advertisement -