అభివృద్ధి పథంలో హైదరాబాద్ : మంత్రి కేటీఆర్

139
ktr
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో హైదరాబాద్ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు మంత్రి కేటీఆర్. లోయర్ ట్యాంక్‌ బండ్‌లోని మారియెట్ కన్వెన్షన్‌ సెంటర్‌లో హుషార్‌ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్… కోవిడ్ ప్రభావం అన్ని రంగలమీద పడింది… నష్టపోయిన వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

సీఎం రిలీఫ్ ఫండ్ ని… నష్టపోయిన చిన్న పరిశ్రమలకు కూడా అందిస్తాము.…కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భాన్ కార్యక్రమం కింద ఎంత మందిని ఆడుకుందో నాకు తెలీదు….. డిమానిటైసేషన్ వల్ల చిరు వ్యాపారులు ఎన్నో కష్టాలు పడ్డారని చెప్పారు. గతంలో పవర్ లేక.. చిరు వ్యాపారులు చాలా ఇబ్బందులు పడేవారు…. కరెంట్ కోసం ధర్నాలు కూడా చేశారు కానీ ఇప్పుడు పరిస్థితిని మర్చామన్నారు.

తెలంగాణ వచ్చాక 24 గంటలు విద్యుత్ అందిస్తున్నాం… సిటీలో నా చిన్న తనంలో నెలకోసారి అల్లర్లు జరిగేవి. స్కూల్స్, పరిశ్రమలు బంద్ చేయించేవారు. దీనివల్ల విద్యార్థులతో పాటు వ్యాపారులు ఇబ్బంది పడ్డారని చెప్పారు. సిటీలో అల్లర్లు జరగకుండా చూస్తున్నాం….. శాంతి భద్రతలు అదుపులోకి తెచ్చామన్నారు. హైదరాబాద్ ని అభివృద్ధి పథం వైపు తీసుకెళ్తున్నాం.….సిటీ ఔట్స్ కట్స్ కొత్తగా వస్తున్న టౌన్షిప్ లకు రోడ్లు వేస్తున్నాం అన్నారు.

ఏరో స్పేస్ ఇండస్ట్రీ, లైఫ్ సైన్స్, ఫార్మా, ఐటీ ని హైదరాబాద్ కి తీసుకొచ్చాము…. హైదరాబాద్ తో పాటు టూటైర్ సిటీల్లోనూ ఇండస్ట్రీలను నెలకొల్పేందుకు యత్నిస్తున్నామన్నారు. సిటీలో అందుతున్న వైద్యం, విద్య, ఉద్యోగోవకాశాలను జిల్లాల్లోనూ కల్పిస్తున్నాము…. జిల్లాల్లోనూ ఇన్వెస్ట్ చెయ్యాలని వ్యాపారవేత్తలను కోరుతున్నా అన్నారు. ఆగ్రో ప్రొస్సేసింగ్ ఇండస్ట్రీకి మంచి డిమాండ్ ఉంది.….పాడీ ఇండస్ట్రీలో మనం దేశంలోనే రెండో స్థానంలో ఉన్నాము… వరి, పప్పు ధాన్యాలు బాగా పండుతున్నాయన్నారు. వివిధ జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలను పెట్టేలా చూస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దయానంద్ గుప్త, టూరిజం కార్పోరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, పోలీసు హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ గుప్తా, హ్యాండ్ క్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సంపత్ కుమార్ గుప్తా పాల్గొన్నారు.

- Advertisement -