చరిత్రలో ఈ రోజు : డిసెంబర్ 23

234
What Happened This Day In History
- Advertisement -

డిసెంబర్ 23, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 357వ రోజు (లీపు సంవత్సరములో 358వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 8 రోజులు మిగిలినవి.

*?సంఘటనలు?*

?1912: రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చే సందర్భంగా జరిగిన సంబరాలలో వైస్రాయి లార్డ్ హర్డింగ్ పై జరిగిన హత్యాప్రయత్నం ఢిల్లీ-లాహోర్ కుట్రగా చరిత్రకెక్కింది

?1920: ‘హైదరాబాదు కంపెనీస్ ఛట్టం ప్రకారం, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ‘ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్.సి.సి.ఎల్) ‘ అనే పేరుతో ఏర్పడింది. హైదరాబాదు (డెక్కన్) కంపెనీ లిమిటెడ్ కి చెందిన సమస్త హక్కులను (అప్పులు, ఆస్తులు) మొందింది. కాలక్రమంలో, 1956 కంపెనీస్ చట్టం ప్రకారం, ప్రభుత్వ సంస్థగా అవతరించింది.

*?జననాలు?*

?1881: బలిజేపల్లి లక్ష్మీకాంతం, స్వాతంత్ర్య సమరయోధులు, అవధాని, నాటక రచయిత, రంగస్థల మరియు సినిమా నటులు. (మ.1953)

?1891: వీరమాచనేని ఆంజనేయ చౌదరి, స్వసంఘ పౌరోహిత్యానికి మూలపురుషుడు. (మ.1988)

?1902: చరణ్ సింగ్, భారత దేశ 5 వ ప్రధానమంత్రి. (మ.1987)
1922: ఘండికోట బ్రహ్మాజీరావు, ప్రముఖ ఉత్తరాంధ్ర రచయిత, సాహితీ వేత్త. (మ.2012)

?1933: శిరోమణి సహవాసి, ఈనాడు దినపత్రికలో ఉద్యోగిగా చేరాడు. 1984లో సహాయక వార్తా సంపాదకునిగా పనిచేశాడు.

?1936: ఆదేశ్వరరావు, సమకాలీన హిందీ రచయిత.

?1940: ముదిగొండ శివప్రసాద్, చారిత్రక నవలా రచయిత.

?1966: చెరుకూరి సుమన్, బుల్లితెర రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, చిత్రలేఖకుడిగా, ఉషాపరిణయం చిత్ర నటుడిగా తెలుగువారికి సుపరిచితుడు. (మ.2012)

*?మరణాలు?*

?1987: ఈమని శంకరశాస్త్రి, ప్రసిద్ధ వైణికుడు. (జ.1922)

?1997: గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి, సుప్రసిద్ధ పండితులు. (జ.1880)

?2004: పి.వి.నరసింహారావు, పూర్వ భారత ప్రధానమంత్రి. (జ.1921)

*?పండుగలు మరియు జాతీయ దినాలు?*

*?కిసాన్ దినోత్సవం*?.

- Advertisement -