హృదయాన్ని కలచివేసింది: ఎంపీ సంతోష్

232
china corona
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పాతిక లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా రెండు లక్షలకుపైగా మృత్యువాత పడ్డారు.

కరోనా పుట్టిన చైనాలోని వుహాన్‌ పేరు వింటేనే ప్రజలు వణికిపోతున్నారు. అలాంటి చోట ఓ చిన్నారికి కరోనా వైరస్ సోకడం ..ఆ చిన్నారి తల్లి పడుతున్న బాధ అందరిన చేత కన్నీళ్లు పెట్టిస్తోంది. ఇక ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోని షేర్ చేసిన టీఆర్ఎస్ ఎంపీ సంతోష్…ఇంతకంటే గుండె పగిలే బాధ ఉండదని..తన హృదయాన్ని కదలించివేసిందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. చిన్నారికి ఏం జరుగుతుందో తెలియదని..ఇలాంటి పరిస్ధితి ఎవరికి రాకూడుదంటే ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండి కరోనా కట్టడి చేసేందుకు కృషిచేయాలని పిలుపునిచ్చారు.

- Advertisement -