కరోనా విజృంభణతో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..

203
night curfew in Maharashtra
- Advertisement -

కరోనా విజృంభణ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెకండ్ వేవ్ దెబ్బకు వణికిపోతున్న మహారాష్ట్ర సోమవారం నుంచి రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. రాత్రి 8 నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉంటాయని వెల్లడించింది. కరోనా వైరస్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్న నేపధ్యంలో పరిస్థితిని అదుపుచేసేందుకు సీఎం ఉద్దవ్ థాకరే అధ్యక్షతన సమావేశమైన మహారాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

కేసులు పెరుగుతున్న జిల్లాల్లో ఇప్పటికే లాక్ డౌన్ అమలు చేస్తున్నా కేసులు తగ్గకపోవడంతో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని మంత్రివర్గ సమావేశం అభిప్రాయపడింది. పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతుండడంతో గత్యంతరం లేక రాత్రిపూట కర్ఫ్యూ విధించాల్సి వచ్చిందని.. శుక్ర వారం రాత్రి నుండి సోమవారం ఉదయం వరకు కంప్లీట్ లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇన్ని చర్యలు అమలు చేసినా కేసులు తగ్గకపోతే లాక్ డౌన్ విధించాల్సి వస్తుందని ప్రభుత్వం హెచ్చరించింది.

ప్రైవేటు ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయాలని, ప్రభుత్వ కార్యాలయాలు 50శాతం సిబ్బందితో పనిచేస్తాయని స్పష్టం చేసింది. 50శాతం సామర్థ్యంతోనే ప్రజారవాణా ఉంటుందని మహా ప్రభుత్వం తెలిపింది. కర్ఫ్యూ సమయంలో హోటళ్లు, మాల్స్, రెస్టారెంట్లు, బార్లను పూర్తిగా మూసివేస్తారు. హోటళ్లలో కూర్చుని తినే అవకాశం లేకుండా.. పార్శిల్ ఇచ్చే పద్ధతి అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు నిర్దేశించిన మార్గదర్శకాల ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -