మొక్కలు నాటిన VPJ ఫౌండేషన్ చైర్మన్

364
vishnu
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి అధ్బుతమైన స్పందన వస్తోంది. ఇక సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. తాజాగా VPJ ఫౌండేషన్ చైర్మన్ విష్ణు జగతి మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ములుగు మండలం వంటి మామిడి లో సినిమా నటుడు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి కాదంబరి కిరణ్ గారితో కలిసి మొక్కలు నాటారు.

ఈసందర్భంగా విష్ణు జగతి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కెసిఆర్ 66వ పుట్టినరోజు పురస్కరించుకొని 66మంది తో కలిసి మొక్కలు నాటినట్లు తెలిపారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్ కు ధన్యవాదలు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు.

Vishnu jagati

- Advertisement -