- Advertisement -
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆదివారం (ఏప్రిల్ 4) కోవిడ్ 19 టీకా రెండో డోసు తీసుకున్నారు. ఈరోజు ఉదయం ఢిల్లీలోని ఎయిమ్స్ దవాఖానలో టీకా తీసుకున్నారు. గత నెల 1న తమిళనాడులోని చెన్నై ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మొదటి డోసు వేయించుకున్నారు.
‘ఎయిమ్స్ ఆస్పత్రిలో కోవిడ్ 19 రెండో డోసు ఇవాళ తీసుకున్నాను. అర్హులైన ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా.దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి.’ అని వెంకయ్య నాయుడు ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.
- Advertisement -