ఓటుకు నోటు..రేవంత్ పిటిషన్ వాయిదా

2
- Advertisement -

ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ వాయిదా వేసింది సుప్రీం కోర్టు. ఓటుకు నోటు కేసు ఏసీబీ పరిధిలోకి రాదంటూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు సీఎం రేవంత్.

ఈ కేసుకి తనకి ఎలాంటి సంబంధం లేదని రెండేళ్ల తర్వాత తనని ఉద్దేశపూర్వకంగా ఇరికించారని మాజీ ఎమ్మెల్యే సండ్ర మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్ లను విచారించింది న్యాయమూర్తి జేకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం.

తదుపరి విచారణను అక్టోబర్ 14కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.

Also Read:బంగాళాఖాతంలో అల్పపీడనం..హై అలర్ట్

- Advertisement -